Christian missionaries in the making of modern india by puritigadda suresh babu in telugu
Processing: – Dispatch:
Shipped from: Hyderabad (Map for Verification)
EachDayKart® QuickShip: Hyderabad, Vizag Region (T&C Apply)
- Telugu Title: ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర
- Author: Puritigadda. Suresh Babu
-
Binding: Paperback
- Language: Telugu,
- Total Pages: 264,
- Measurement: 21L x W14 x 1H
- Weight: 0.350g
- ISBN: 9788194589747
- Published By: Sikkolu Book Trust,
- First Editon: 2020.
- Fulfillment by: Eachdaykart India strategic sub unit.
- Christian books include a wide range of literature, encompassing Bibles, devotionals, prayer books, theology texts and books to help in everyday Christian life.
Telugu Description
ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర:
విద్యకు, వైద్యానికి, సమాజానికి దూరం చేసిన నిమ్నవర్గాలకు విద్యానేత్రాన్ని చూపి వెలుగుబాటలో కొత్త కాంతులు నింపిన క్రైస్తవ మిషనరీలు నిత్యం పూజార్హులే. ఈ దృక్పథంతో రాసిన "ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర" అనే సాధికారిక గ్రంథాన్ని రూపొందించిన పురిటిగడ్డ సురేష్ బాబు అభినందనీయుడు.- ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి.
మూఢనమ్మకాలనే అంధకారంలో కునారిల్లుతున్న కోట్లాది మందికి వెలుగును ప్రసరింపచేసినన క్రైస్తవ మిషనరీల సేవాతత్పరతను సహోదరుడు సురేష్ బాబు గారు ఈ పుస్తకములో చక్కగా వివరించారు. - రెవ. డా. ఎం. జోషి లీలన్ రెడ్డి
మిషనరీల చరిత్ర చుట్టూ ఏర్పడ్డ ఒక మిత్ని, గందరగోళాన్ని బద్దలు చేస్తూ, అనేకానేక సత్యాలను పురిటిగడ్డ సురేష్బాబు రచించిన "ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర" పుస్తకం చరిత్రలోని అనేక చిక్కుముడులను వివేచనాత్మకంగా విప్పుతుంది. నిప్పుల గుండం మీద నడిచిన చరిత్రని రికార్డు చేసిన పుస్తకమిది. మిషనరీల మీద చౌకబారు విమర్శలు చేసేవారికి, మిషనరీల మీద అపవాదులు సృష్టించేవారికి, మిషనరీలు కేవలం క్రైస్తవ్యం కోసమే ఉన్నారనేవారికి, క్రైస్తవ్యాన్ని కేవలం ఒక మతంగా మాత్రమే చూసేవారికి ఒక స్పష్టమైన చూపును ప్రసాదిస్తుంది. -డాక్టర్ నూకతోటి రవికుమార్
అనివార్యతల లోనుంచి ఒక సత్యాన్ని ఆవిష్కరించాల్సిన సందర్భం ఎదురవుతూ ఉంటుంది. మస్తిష్కాలలో అసత్యాలను ప్రవేశపెడుతూ ద్వేషాన్ని ఉత్పన్నం చేసే నిత్య ప్రణాళికలకు అడ్డుచెప్పే ఒక గొంతు సన్నగానైనా వినబడుతుంది. శ్రీ పురిటిగడ్డ సురేష్ బాబు రచించిన "ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర" అనే గ్రంధం అలాంటి ఒక ప్రయత్నం. ఒక సిద్ధాంత వ్యాస విస్తృతి కలిగిన ఈ రచన అనేక అబద్ధాలను అడ్డుకునే ఒక ప్రయత్నంగా భావించవచ్చు. -మల్లవరపు ప్రభాకరరావు
పురిటిగడ్డ సురేష్ బాబు క్రైస్తవ మిషనరీలు మన దేశంలో ఎప్పుడు వచ్చారో చెప్పడం మొదలుపెడుతూ, ఏ విధంగా ఈ దేశవాసులకు ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అంటే మొత్తంగా బహుజనులకు సహాయపడ్డాయో ఒక్కో పొరనూ విప్పుకుంటూ చెప్పుకొచ్చారు. సమాజంలో మతంవల్లనే దట్టంగా పేరుకుపోయిన అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాలు, అపోహలు, అనారోగ్యం తదితరాల దుమ్మును గట్టిగా దులిపి సమాజపు ఊర్ధ్వచలనానికి తోడ్పడిన క్రైస్తవ మిషనరీల చరిత్ర ఇది. - దుప్పల రవికుమార్